Saturday 30 November 2013
చలి చర్మానికి...
- చల్లారిన ఒక కప్పు టీనీళ్లలో రెండు స్పూన్ల బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బియ్యప్పిండి మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడడం వల్ల చర్మానికి కండిషనర్ దొరికినట్టే.
- ఇంకా చదవండి
అత్తారింట్లో నవవధువు అలవాటుపడేదెలా?
కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింట అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అంపకాల సమయంలో భర్త తరుపు వారికి ఇబ్బంది రాకుండా నడుచుకో అంటూ అమ్మ చెప్పే జాగ్రత్తలు మరింత కంగారును పుట్టిస్తాయి.ఎవరితో ఏ విధంగా మాట్లాడితే ఏమవుతుందో అనే ఆదుర్దా పెళ్ళికూతుర్ని ఇబ్బంది పెడతాయి. పోనీ భర్తను అడిగి తెలుసుకుందామంటే ఆయన తన పనులతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో పెళ్ళికూతురికి ఉపకరించే కొన్ని చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము. ఇంకా చదవండి.
Thursday 28 November 2013
Monday 25 November 2013
Sunday 24 November 2013
స్వధార్హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం
ఏ అమ్మాయీ తనకై తాను ఇల్లొదిలి వచ్చేయదు.
ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు.
ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు.
ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు.
ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు.
మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా....
తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి.
కానీ ఇలాంటి అమ్మాయికి...
దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి...
తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు.
కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు. ఇంకా చదవండి .
Saturday 23 November 2013
అంధుల కోసం పత్రిక
మారుమూల గ్రామంలో ఉన్నా, మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నా.. మంచి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు ఎన్ని అడుగులైనా వేగంగా పడతాయి. ఇలాగే ఆలోచించిన ముగ్గురమ్మాయిలు చదువుకునే వయసులోనే సామాజిక స్పృహతో కదిలారు. ఐరాస మెచ్చే స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన కీర్తి, వైభవి... అంధుల కోసం మాసపత్రికను తీసుకొస్తున్న ఉపాసనల స్ఫూర్తి పథమిది. రోజూ పది దినపత్రికలు చదివే ఉపాసన 'నా సంగతి సరే, మరి చూపులేని వారు వీటినెలా చదవగలరు' అని ఆలోచించింది. వీలైనంత మందికి ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్రెయిలీలో ఆంగ్ల మాస పత్రికను తీసుకురావడం మొదలుపెట్టింది. ఇంకా చదవండి .
రుక్మిణి త్యాగం
రుక్మిణి దేవి మధురై లో ఒక ఎగువ తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 29 ఫిబ్రవరి 1904 న జన్మించారు. ఆమె తండ్రి నీలకంఠ శాస్త్రి, ఒక పండితుడు మరియు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా, పని చేసేవాడు. అతను ఒక బదిలీ ఉద్యోగం ఉంది మరియు కుటుంబం తరచుగా మారుతూ. అతను 1901 లో దివ్యజ్ఞాన సమాజం ప్రవేశపెట్టారు. లోతుగా డాక్టర్ అనిబిసెంట్ ఒక అనుచరులుగా దివ్యజ్ఞాన ఉద్యమంలో ప్రభావితం, నీలకంఠ శాస్త్రి అతను దివ్యజ్ఞాన సమాజం అడయార్ యొక్క ప్రధాన కార్యాలయం సమీపంలో తన ఇంటి నిర్మించాడు విరమణ మీద చెన్నై, అడయార్ తరలించబడింది. ఇది యువ రుక్మిణి కేవలం దివ్యజ్ఞాన ఆలోచన బారినపడ్డారు ఇక్కడ, కానీ సంస్కృతిపై కూడా కొత్త ఆలోచనలు, తరువాత థియేటర్, సంగీతం మరియు నృత్య, మరియు అన్నే బిసెంట్ అత్యంత సన్నిహితుడు మరియు తరువాత ప్రఖ్యాత బ్రిటీష్ Theosophist డాక్టర్ జార్జ్ Arundale కలుసుకున్నారు వారణాసి లో సెంట్రల్ హిందూ మతం కాలేజ్ యొక్క ప్రధాన, మరియు వెంటనే అతనితో శాశ్వత బాండ్ నిర్మించడానికి.ఇంకా చదవండి .
మెరిసిపోండిలా..
తెల్లగా కనిపించాలని వైటనింగ్ లోషన్లు, క్రీమ్లు పూసి పూసి విసుగెత్తిపోయారా?
అయితే ఇకనుంచి వాటన్నింటినీ పక్కకి నెట్టేయండి. ఎందుకంటే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలున్నాయి కాబట్టి. అవేంటంటే...ఇంకా చదవండి
Friday 22 November 2013
ఆర్థికమంతా అతివల చేతుల్లోనే...
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన దేశంలో ప్రముఖ బ్యాంకులన్నిటికీ ముఖ్య అధికార స్థానాల్లో మహిళలే ఉన్నట్టయింది. 207 ఏళ్ల ఆ బ్యాంకు చరిత్రలో ఛైర్పర్సన్గా ఒక మహిళ నియమితమవడం ఇదే తొలిసారి. సహోద్యోగులు చెబుతున్నదాని ప్రకారం, అరుంధతి తొమ్మిది స్థానాలున్న సంఖ్యలతో లెక్కలు సైతం బుర్రలోనే చే సెయ్యగలరు! 1977లో ప్రొబేషనరీ ఆఫీసర్గా కోల్కతాలో కెరీర్ ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూనే, తోటి మహిళా ఉద్యోగుల సాధకబాధకాలు పట్టించుకోవడంలో ముందుండేవారు. అటు కుటుంబాన్నీ ఇటు ఉద్యోగ జీవితాన్నీ సరిగా చూసుకోవడానికి స్త్రీలెంత కష్టపడతారో ఆమె బాగా అర్థం చేసుకుని వ్యవహరిస్తారని అరుంధతితో పాటు పనిచేసిన ఉద్యోగినులు చెబుతున్నారు. ఎస్బీఐలో రెండు లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో 40వేల మంది మాత్రమే మహిళలున్నారు. మహిళా ఉద్యోగులు కోసం ఆరోగ్య పరీక్షలు ప్రవేశపెట్టిన ఘనత అరుంధతి సొంతం. వచ్చే మూడేళ్లలో ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తన ప్రతిభతో సమర్థంగా నెగ్గుకొస్తారని ఆశిస్తున్నారు ఆమె సహోద్యోగులు. ఇంకా చదవండి .
శభాష్ మహిళా - వైకల్యాన్ని జయించారు..
ఆత్మవిశ్వాసాన్నే ఆలంబనగా చేసుకొని సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు తహతహలాడారు. అంగవైకల్యం అడ్డుగా నిలిచినా తాము కన్న కలలను సాకారం చేసుకునేందుకు, ఐదువేళ్లు నోట్లోకి వెళితేనే ముద్ద నోట్లోకి వెళుతుందని ఆ ఐదుగురు మహిళలు నిరూపించారు. ఆసరా ఇచ్చే చేతులను అందిపుచ్చుకొని కేవలం 200 చదరపుటడుగుల దుకాణంతో వారు వేసిన అడుగు నేడు స్వావలంబన దిశగా పయనిస్తోంది. రెండు నెలల క్రితమే కేరళలోని వాజిచల్ సమీపంలో ఏర్పాటుచేసిన ఆ దుకాణంలో ప్రతి వస్తువు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దుకాణంలోని ప్రతి వస్తువు వెనుక వారి శ్రమ, నైపుణ్యం, అంతకమించి వాటిని తయారుచేయటంలో చూపించే శ్రద్ధ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అందుకే అక్కడి వస్తువులన్నీ కష్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నేడు ఈ దుకాణం రూపురేఖలే మారి పోయాయ. ఆ ఐదుగురు మహిళలు 40 నుంచి వంద శాతం వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ ఐదుగురు ఓ టీమ్గా తయారై, కలిసికట్టుగా పనిచేస్తే ఈ సమాజమే తమను గుర్తిస్తుందని నిశ్చయించుకున్నారు. ఇంకా చదవండి.
Subscribe to:
Posts (Atom)